Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ విషయంపై ఆయనకు చాలా క్లారిటీ ఉంది.. పూరీ జగన్నాథ్ గురించి చార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్లోను 'మెహబూబా' చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన దైన స్టైల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత దిల్ రాజు మే 11న వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏప్రిల్ 15న హైదరాబాద్ దసపల్లా హోటల్లో ప్రెస్మీట్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, పూరి కనెక్ట్స్లో ఒకరైన ఛార్మి కౌర్, హీరో ఆకాష్, హీరోయిన్ నేహాశెట్టి, కెమెరామెన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్, ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ, ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛార్మి కౌర్ మాట్లాడుతూ..
పూరి జగన్నాథ్ చాలా క్లారిటీగా
‘పూరి జగన్నాథ్ చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాస్తారు. విజువల్స్, డైలాగ్స్ ప్రతిది సినిమా చూసినట్టు నేరేట్ చేస్తారు. ఈ సినిమాకి ది బెస్ట్ టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పూరిగారి మీదన్న ప్రేమతో వర్క్ చేశారు. వారందరికీ పేరు పేరునా నా థాంక్స్' అని ఛార్మి కౌర్ అన్నారు.
హ్యాట్సాఫ్ ఆకాష్ పూరీ
ఆకాష్, నేహా, విషురెడ్డి ఫెంటాస్టిక్గా యాక్ట్ చేశారు. స్పెషల్గా ఆకాష్ యాక్షన్ సీన్స్, వార్, ఛేజ్ సీన్లలో చాలా డేర్గా రియల్గా నటించాడు. వార్ సీన్స్లో 800 సోల్జర్స్తో ఎక్స్లెంట్గా పెర్ఫార్మ్ చేశాడు. హ్యాట్సాఫ్ ఆకాష్ అని తెలిపారు.
సోషల్ మీడియాలో ట్రైలర్ ట్రెండింగ్
ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర్నుండీ, టీజర్, ట్రైలర్ వరకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సోషల్ మీడియాలో 4 మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్ అవుతోంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'ఓ ప్రియా.. నా ప్రియా' సాంగ్ని ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మే 11న దిల్రాజుగారు రిలీజ్ చేస్తున్నారు. ఆయనకి స్పెషల్ థాంక్స్'' అని ఛార్మీ అన్నారు.
పూరి జగన్నాథ్ సినిమా అంటే..
దిల్ రాజుగారు సినిమా చూసి పూరిగారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ చేసుకొని 'ఇది పూరిగారి సినిమా అంటే... ఇది పూరిగారి సినిమా అంటే' అన్నారు. ఆయన జడ్జిమెంట్ కరెక్ట్గా వుంటుంది. సినిమా పై మాకున్న కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. స్మాల్ కాంటెస్ట్ని నిర్వహించి పూరి కనెక్ట్స్ ద్వారా బెస్ట్ టాలెంట్ని తీసుకున్నాం అని పూరి వెల్లడించారు.
రిలీజ్కు ముందే క్రేజ్
సినిమా చూసిన దిల్ రాజు 'ఎక్స్ట్రార్డినరీగా వుంది... ఇది పూరి సినిమా అంటే' అని యూనిట్ని అప్రిషియేట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు రిలీజ్ కానున్నాయి. మెహబూబా టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే భారీ వ్యూస్ను సాధించాయి. దాంతో రిలీజ్కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్నది.