twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మీ, చైతూ కలిసి దుబాయి కు...ఆల్రెడీ దేవీశ్రీప్రసాద్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఛార్మి, నాగచైతన్య కలిసి ఎక్కడకో ప్రయాణం పెట్టుకున్నారని మీకు ఇక్కడ ప్లైట్ లో వెళ్తున్న వీరి ఫొటో చూస్తుంటే అర్దమవుతుంది. ఇంతకీ వీరిద్దరూ వెళ్ళేది సిమా 2015 వేడుకకు దుబాయికి. ఈ విశేషాన్ని ఛార్మి తన ట్వీట్ ద్వారా తన అబిమానులకు తెలియచేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వరుసగా నాలుగో ఏడాది ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 'సైమా' పండగ దుబాయ్‌లో జరగబోతోంది. గురు, శుక్రవారాల్లో 'సైమా' అవార్డు వేడుకను అట్టహాసంగా చేయబోతున్నారు.

    తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ కథానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

    Charmy with Naga Chaitanya @Plane

    'సైమా' (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అంటేనే సంబరం! దక్షిణాది తారలంతా ఓ చోట కలసి సందడి చేసే వేదిక.. వినోదాల వేడుక. ఆట పాటలు, ఆనందోత్సవాల సమ్మేళనం. మరోసారి ఈ పండుగకు రంగం సిద్ధమైంది.

    శ్రియ, తాప్సి, ఆదాశర్మ, కృతి కర్బంద, షర్మిలా మాండ్రే, పూజా హెగ్డే.. వీళ్లంతా తమ ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యారు. 'సైమా' వేడుకల్లో ఈ కథానాయికలంతా సూపర్‌ హిట్‌ గీతాలకు నృత్యాలు చేయబోతున్నారు. బుధవారం ఈ హీరోయిన్స్ నృత్య సన్నాహాల్లో బిజీ బిజీగా గడిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

    ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ అక్కడకి చేరుకున్నారు... ఆ ఫొటో ఇక్కడ చూడండి

    #SIIMA2015

    Posted by Devi Sri Prasad on 5 August 2015

    English summary
    Charamy, Naga Chaitanya, and Devi Sri Prasad reached Dubai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X