Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
8 ఏళ్ల క్రితం ఇక్కడే మా ప్రేమ మొదలైంది: చైతూతో సమంత సెల్ఫీ!
సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. తన భర్త చైతన్యతో కలిసి న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో సెల్ఫీ దిగిన ఆమె అభిమానులకు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాకు సెల్ఫీలు దిగడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దిగాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ పార్క్లోనే 8 ఏళ్ల క్రితం మా మధ్య ప్రేమ మొదలైంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని మా నమ్మకం. అందుకే ఈ ప్లేసుకు థాంక్స్ చెప్పుకోవడానికే తిరిగి ఇక్కడకు వచ్చాము... అని సమంత తెలిపారు.
సమంత, చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' మూవీ చిత్రీకరణ 8 ఏళ్ల క్రితం న్యూయార్కులోని సెంట్రల్ పార్కులో జరిగింది. ఇక్కడ వీరి మధ్య పలు ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది. గతేడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on
యూఎస్ఏలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అనంతరం ఈ జంట ఏప్రిల్ 6న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీ కానున్నారు. సమంత తమిళ చిత్రాలైన సీమరాజా, సూపర్ డిలక్స్, తెలుగు మూవీ 'యూటర్న్' చిత్రాల షూటింగుల్లో జాయిన్ అవుతారు. నాగ చైతన్య ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు.
పెళ్లయిన తర్వాత సమంత, చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి చేయబోతున్నారు. ఈ చిత్రానికి కంబైన్డ్ రెమ్యూనరేషన్ రూ. 7 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.