Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాణ బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. దీంతో పాటు చెక్ బౌన్స్ కేసు కూడా నమొదైంది. ‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషికి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజేసారు.
హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా తెలుగులో ‘నీజతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసారు. నజియా హీరోయిన్ గా నటించింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.
ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్ మీడియా, బండ్ల గణేష్ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మించాయి. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అప్పట్లో అంతటా వినిపించింది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరించాడని అప్పట్లో టాక్.