Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన దర్శకుడిపై కేసు
పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేసి ముఖం చాటేసిన దర్శకుడిపై ఓ మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో పాటు తన వద్ద డబ్బు తీసుకుని పరారయ్యాడని పి.లక్ష్మి అనే మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేసే పి.లక్ష్మి అనే మహిళకు శ్రీదత్త అనే వర్ధమాన దర్శకుడు పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు, ఆపై సహజీవనానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీదత్త కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడం, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన వద్ద డబ్బు, బంగారం తీసుకుని వెళ్లాడని... ఇపుడు మరో యువతిని పెళ్లాడి తనకు అన్యాయం చేశాడని లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
లక్ష్మి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో నిజా నిజాలు నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు.