Don't Miss!
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నితిన్ సినిమా ఆడియో రైట్స్ ఇష్యూ: చీటింగ్ కేసు
హైదరాబాద్: నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో రైట్స్ విషయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో....శ్రేయాస్ మీడియా మేనేజింగ్ డైరెకర్టర్ జి.శ్రీనివాస్ రావు మీద చీటింగ్ కేసు నమోదైంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. ఆడియో రైట్స్ తీసుకుని తీసుకుని డబ్బులు ఎగ్గొట్టాడని, తిరిగి ఇవ్వకుండా మోసం చేసాడని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసారు.
నిందితుడు శ్రీనివాసరావు.... సుధాకర్ రెడ్డి నుండి ‘గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో రైట్స్ ను తీసుకున్నాడు. డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే అగ్రిమెంటు ప్రకారం శ్రీనివాసరావు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. సుధాకర్ రెడ్డి ఎన్ని సార్లు అడిగినా మొహం చాటేసాడు.
అనంతరం సుధాకర్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అయినా శ్రీనివాసరావు రెస్పాండ్ కాలేదు. శ్రీనివాసరావు ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ కంపెనీకి అమ్మినట్లు తెలియడంతో...సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.