Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమా ఎఫెక్ట్! స్పెషల్ పించన్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సినిమా అనేది సమాజాన్ని, సమాజంలోని జనాన్ని, ప్రభుత్వాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏకంగా ఓ సినిమా చూసి దేశంలోని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ఎఫెక్ట్ ఇటు జనంపై అటు ప్రభుత్వంపై పడింది. ఇంతకీ అసలు సంగతి ఏంటి? వివరాల్లోకి పోతే..
దీపిక పడుకొనే లీడ్ రోల్ చపాక్
యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘ఛపాక్'. బాలీవుడ్ భామ దీపిక పడుకొనే ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు, యాసిడ్ దాడి బాధితుల సమస్యలు, వాటి వల్ల జరిగే పరిణామాలు ఈ సినిమాలో చూపించారు.
దుర్ఘటనల ఎఫెక్ట్.. ప్రభుత్వాల ప్రోత్సాహం
నిజ జీవితంలోని దుర్ఘటనల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అద్దంపట్టే విధంగా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందే కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇచ్చాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రభుత్వాలు ‘చపాక్' చిత్రానికి అండగా నిలుస్తూ పన్ను రాయితీ ఇచ్చాయి. ఇక విడుదలయ్యాక ఈ సినిమా సూపర్ జోష్ కొనసాగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే ఛపాక్ సినిమా విడుదల తర్వాత ఆ ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. యాసిడ్ బాధితులకు త్వరలోనే ఫించన్ను అందించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్యా తెలపడం విశేషం.
Recommended Video
యాసిడ్ దాడి బాధితులకు స్పెషల్ ఫించన్
సమాజంలో గౌరవంగా జీవించేందుకు గాను యాసిడ్ దాడి బాధితులకు ప్రతీ ఏడాది 5000 నుంచి 6000 రూపాయల నగదును ఫించన్గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి రేఖా ఆర్యా వెల్లడించారు. కేబినెట్లో ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే దీనిని అమలులోకి తెస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి గురైన మహిళల కళలు సాకారం అయ్యేలా ఈ పథకం రూపుదిద్దుతామని మంత్రి రేఖా ఆర్య తెలిపారు.