Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ ఫ్యాన్స్ మాత్రమే చేశారు.. ప్రపంచంలో ఎవరూ ఇలా చేయరు: చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్
మూడేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశాడు. ఎందరో బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి సుమారు 130కి పైగా బాల నటుడిగా పని చేశాడు. ఈ క్రమంలోనే బాల నటుడిగా ఎన్నో అవార్డులు సాధించాడు. అలాగే, మరెన్నో రికార్డులు సృష్టించాడు. మొత్తం మూడు భాషల్లో అత్యధిక సినిమాల్లో నటించిన బాల నటుడిగా నిలిచాడు. ఇంతకీ అతనెవరో తెలుసా..? అప్పుడు బాల నటుడిగా మెప్పించి.. ఇప్పుడు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేంద్రన్.
పెదరాయుడుతో ఎంట్రీ
తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘పెదరాయుడు' సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేంద్రన్. ఈ సినిమాలో కనిపించేది కొద్ది సమయమే అయినా.. అత్యంత ముఖ్యమైన పాత్రను చేశాడు. ఆ తర్వాత ‘పెళ్లిచేసుకుందాం', ‘ఆహా..!', ‘దేవి', ‘లిటిల్ హార్ట్స్', ‘సింహాద్రి' తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు.
కోలీవుడ్లో హీరోగా పరిచయం
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన మహేంద్రన్ కోలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘జగ్గూ భాయ్', ‘విఝా', ‘విందై', ‘విరైవిల్ ఇసై' సహా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులోనూ ‘ఫస్ట్ లవ్' అనే సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. తాజాగా ‘సావి' అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
28 ఏళ్లలో 26 సంవత్సరాలు సినిమాల్లోనే..
మహేంద్రన్ సినీ రంగంలోకి అడుగు పెట్టి గత సంవత్సరంతో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియా ద్వారా అభిమానులు, శ్రేయోభిలాసులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికి అతడి వయసు 28 సంవత్సరాలు అయితే, అందులో 26 ఏళ్లు సినీ కెరీర్ ఉంది.
తాజా ఇంటర్వ్యూలో పవన్ గురించి
అతడి ‘సావి' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మహేంద్రన్ ఓ యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘పవన్ కల్యాణ్ గారి సినిమా విడుదలైంది. ఆ సమయంలో ఎక్కడో, ఎవరో పైరసీ చేశారని వార్తలు వచ్చాయి. వెంటనే ఆయన అభిమానులు సీడీలు అమ్మే షాపులపై దాడులు చేశారు. అంతేకాదు, పవన్ సినిమాతో పాటు మరికొన్ని పైరసీ సీడీలను ద్వంసం చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్ చేయడం మాత్రమే చూశాను. ప్రపంచంలో ఇలా ఎక్కడా చేయలేదు' అని చెప్పుకొచ్చాడు.