Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సీసీసీ నుంచి మూడో విడత సాయం.. చిరు సందేశం వైరల్
కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను, ఉపాధి కోల్పోయిన సినీ శ్రామికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోస సీసీసీ ద్వారా సినీ కార్మికుల పొట్ట నింపుతున్నారు. ఇప్పటికే రెండు విడుతలు వారికి కావాల్సిన వంట సామాన్లను అందించారు. నిత్యావసర సరుకులకు ఏ లోటు రాకుండా చూసేందుకు సీసీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా మూడో విడతను కూడా ప్రారంభించినట్టు తాజాగా చిరు తెలిపారు.
ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇచ్చినా కూడా సెట్పైకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. గడప దాటకుండా ఇంట్లో ఉంటేనే కరోనా వదలడం లేదు. ఇక షూటింగ్ సెట్లోకి వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం కూడా. అందుకే పెద్ద హీరోలెవ్వరూ కూడా గడపదాటడం లేదు. అందుకే షూటింగ్ల సందడి కూడా కనిపించడం లేదు. దీంతో ఉపాధి లేక ఎంతో మంది సినీ కార్మికులు ఖాళీగానే ఉంటున్నారు. అందుకే మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చిరు తెలిపారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం.సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే. అందరూ ఐక్యంగా పనిచేసుకుని సంతోషంగా గడిపే రోజు దగ్గర్లోనే ఉంది. అంత వరకు ధైర్యంగా నిలబడదాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ తమకేమీ సోకదనే నిర్లక్ష్య ధోరణి అసలు పనికి రాదని.. అందరూ తమను తాము రక్షించుకుంటూ, వారి కుటుంబానికి కూడా రక్షణగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ విడతలో రెండు రాష్ట్రాల్లోని దాదాపు పదివేల మంది కార్మికులను అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.