Don't Miss!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
తలసాని సేవా ట్రస్ట్ కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు.. కారణాన్ని వివరించిన మెగాస్టార్
కరోనా దెబ్బకు తెలుగు సినీ పరిశ్రమ ఎంతగా కుదేలైందో అందరికీ తెలిసిందే. గత రెండు నెలలుగా షూటింగ్స్ జరగక, థియేట్స్ మూతపడటం వంటి వాటితో ఎంతో మంది ఉపాధిని కోల్పోయార. దాదాపు 14 వేల మంది ఉపాధి లేక బిక్కుబిక్కుమంటున్నారు. వారి వేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు సినీ పెద్దలు. చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలందరూ కలిసి.. సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని, సీఎం కేసీఆర్లతో భేటీ అయ్యారు.
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం..
టాలీవుడ్ పెద్దలందరూ విన్నవించిన సమస్యలను విన్న ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించింది. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇన్ డోర్ షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొంది.
కార్మికుల సాయం కోసం..
సినీ కార్మికులకు అండగా సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలిచారు. ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం అందించారు. ఈ మేరకు నేటి ఉదయం నిత్యావసర సరకులను అందించారు.
సెలెబ్రిటీల చేతుల మీదుగా..
అయితే ఈ సరుకులను సెలెబ్రిటీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు సినీ పెద్దలందరూ పాల్గొన్నారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారంతా కదిలి వచ్చారు. సినీ కార్మికులను సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం కనిపించలేదు.
వివరణ ఇచ్చిన మెగాస్టార్..
తలసాని సేవా ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోయానని చిరంజీవి చెప్పుకొచ్చాడు. తన ఇంటి సభ్యులు (ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు) మృతి చెందిన కారణంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని అందుకే రాలేకపోయానని తెలిపాడు. తమకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉన్న మంత్రి తలసానికి ఎప్పుడూ రుణపడి ఉంటామని, ఇంత గొప్ప పని చేస్తున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.