Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం భారత దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సరైన నివాళిని అర్పించింది. ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాదిగానూ ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను ఎస్పీబీకి ప్రకటించారు. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
మరణానంతరం..
పద్మ అవార్డులను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రధానం చేస్తుంటారు. అలా అందులో కొంత మందికి మరణించిన తరువాత సైతం పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఈ సారి అలా మరణానంతరం పద్మ అవార్డుల వరించిన వారు కూడా ఉన్నారు. అందులో ఎస్పీబీకి పద్మ విభూషణ్ వరించింది.
గతేడాది..
ఎస్పీబీ పాటల ప్రోగ్రాంలో పాల్గొనడం, అలా కరోనా రావడం, చివరకు లోకాలను వదిలి వెళ్లడం అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకుంటున్నారనే శుభవార్త వచ్చినా కూడా చివరకు ఇతర సమస్యలు వెంటాడటంతో అభిమానులను ఒంటరి చేసి కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఎస్పీబీకి సరైన నివాళి అర్పించారు.
పద్మ అవార్డ్పై..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ రావడంతో అందరూ సంతోషాన్నివ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ నుంచి ఎంతో మంది ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అయితే గాయని చిత్రకు కూడా పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
చిరు ఎమోషనల్..
సోదర సమానుడిగా భావించి ఎస్పీబీకి పద్మ విభూషణ్ ప్రకటించడంతో చిరు ఎమోషనల్ అయ్యాడు. ఆ పురస్కారానికి ఎస్పీబీ అర్హుడే. అయితే మరణానంతరం అనే పదం చూసి మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ అది మనం జీర్ణించుకోవాల్సిన విషయమే అని చిరు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మొత్తంగా అలా..
ఈ ఏడాదికి గానూ మొత్తంగా పద్మ విభూషణ్ను ఏడుగురికి, మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషన్ను పది మందికి, పద్మ శ్రీని 102 మందికి ప్రకటించింది. ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యంకు గతంలో 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్లు వరించాయి.