Don't Miss!
- News ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'చిరు' ని హర్ట్ చేశారు అందుకే ఫంక్షన్ కి ఢుమ్మా కొట్టాడు....
మెగాస్టార్ హర్ట్ అయ్యాడా..మూవీ మొఘల్ డా// డి. రామానాయుడికి చిత్రపరిశ్రమ చేసిన సత్కారానికి మెగాస్టార్ గైర్క్షాజరయ్యాడు. ఎందుకంటే తనకు అవమానం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలో చిరంజీవిని చివరి వరుసకు నెట్టేశారు. కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, పేర్లను పై వరుసలో వేసి చివరి వరుసలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అని వేసేసరికి హర్ట్ అయిన చిరంజీవి ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు..
ఇన్విటేషన్ లో సీనియారిటీ ప్రకారం వేసారనుకుంటే చిరంజీవికి రాజకీయంగా కూడా పేరు వుంది కదా. 18సీట్లు కలిగిన ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడతను. అలాంటి వాడికి కనీసం మాజీ సిఎం రోశయ్య పక్కన కూడా చోటివ్వలేదు. ఇదొక రీజన్ అనుకుంటే ఈ ఫంక్షన్ కి దాసరి నారాయణరావు రావడం కూడా మరో కారణం అంటున్నారు. మేస్త్రీ చిత్రంలో తనను అవహేళన చేస్తూ దాసరి నటించడం, దానికి ఆయనకు ఉత్తమనటుడు అవార్డు రావడం చిరంజీవికి నచ్చలేదు. ఇన్విటేషన్ చూసి చాలా మంది ఊహించినట్టుగానే చిరంజీవి ఈ ఫంక్షన్ కు రాకుండా తన నిరసన వ్యక్తం చేసాడు.