Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్, చెర్రీ సందడి
భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు తమ సేవా సంస్థలు, తమ కార్యాలయాల్లో రిపబ్లికే డేను సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగా మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి.
ఆ వేడుకలను రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ వంటి వారిలో ఎవరో ఒకరు హాజరవుతుంటారు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి కూడా పాల్గొన్నాడు. అలా చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్ అందరూ కలిసి బ్లడ్ బ్యాంక్లో సందడి చేశారు. అంతే కాకుండా రక్తదానం చేసేందుకు వచ్చిన అభిమానులను ప్రశంసించారు. రిపబ్లిక్ డే సందర్బంగా చిరు పిలుపు మేరకు ఎంతో మంది అభిమానులు రక్తాన్ని దానం చేసేందుకు విచ్చేశారు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
ఇక మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని షేర్ చేస్తూ నాగబాబు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక చిరంజీవి సైతం అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తన పిలుపు మేరకు రక్తదానం చేసేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మొత్తానికి ఇలా అందరూ ఒకే చోటకు చేరి గణతంత్ర దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేశారు.