twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్, చెర్రీ సందడి

    |

    భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు తమ సేవా సంస్థలు, తమ కార్యాలయాల్లో రిపబ్లికే డేను సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగా మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి.

    ఆ వేడుకలను రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ వంటి వారిలో ఎవరో ఒకరు హాజరవుతుంటారు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి కూడా పాల్గొన్నాడు. అలా చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్ అందరూ కలిసి బ్లడ్ బ్యాంక్‌లో సందడి చేశారు. అంతే కాకుండా రక్తదానం చేసేందుకు వచ్చిన అభిమానులను ప్రశంసించారు. రిపబ్లిక్ డే సందర్బంగా చిరు పిలుపు మేరకు ఎంతో మంది అభిమానులు రక్తాన్ని దానం చేసేందుకు విచ్చేశారు.

    ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

    Chiranjeevi And Ram Charan Republic Day Celebrations At CCT

    ఇక మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని షేర్ చేస్తూ నాగబాబు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపాడు.

    Chiranjeevi And Ram Charan Republic Day Celebrations At CCT

    ఇక చిరంజీవి సైతం అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తన పిలుపు మేరకు రక్తదానం చేసేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మొత్తానికి ఇలా అందరూ ఒకే చోటకు చేరి గణతంత్ర దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేశారు.

    English summary
    Chiranjeevi And Ram Charan Republic Day Celebrations At CCT.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X