Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్, చెర్రీ సందడి
భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు తమ సేవా సంస్థలు, తమ కార్యాలయాల్లో రిపబ్లికే డేను సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగా మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి.
ఆ వేడుకలను రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ వంటి వారిలో ఎవరో ఒకరు హాజరవుతుంటారు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి కూడా పాల్గొన్నాడు. అలా చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్ అందరూ కలిసి బ్లడ్ బ్యాంక్లో సందడి చేశారు. అంతే కాకుండా రక్తదానం చేసేందుకు వచ్చిన అభిమానులను ప్రశంసించారు. రిపబ్లిక్ డే సందర్బంగా చిరు పిలుపు మేరకు ఎంతో మంది అభిమానులు రక్తాన్ని దానం చేసేందుకు విచ్చేశారు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
ఇక మెగా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని షేర్ చేస్తూ నాగబాబు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక చిరంజీవి సైతం అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తన పిలుపు మేరకు రక్తదానం చేసేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మొత్తానికి ఇలా అందరూ ఒకే చోటకు చేరి గణతంత్ర దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేశారు.