Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సంపూ... చించేసాడు అంటూ చిరంజీవి అభినందన!
హైదరాబాద్: హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.
ఈచిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో సంపూ చెప్పిన భారీ డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పెదరాయుడి పాత్రలో గుక్కతిప్పుకోకుండా డైలాగ్ చెప్పి సంపూర్ణేష్ బాబు అదరగొట్టారని అంటున్నారంతా.
ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా సంపూకు ప్రశంసలు అందాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిూస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాగా... అక్కడ చిరంజీవిని కలిసే అవకాశం దక్కించుకున్నాడు సంపూ. ఈ సందర్భంగా తన కొబ్బరి మట్ట టీజర్ చూపించాడు. అది చూసిన తర్వాత చిరంజీవి... సంపూను డైలాగ్ బాగా చెప్పావ్ అంటూ ప్రశంసించారట.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజన మూవీస్ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.