Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
వకీల్ సాబ్ దర్శకుడు, నిర్మాతకు చిరంజీవి సత్కారం: ఏకంగా ఇంటికి పిలిచి మరీ అభినందన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత చేసిన చిత్రం 'వకీల్ సాబ్'. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీనిని రూపొందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక, ఈ సినిమాను శుక్రవారం రాత్రి మెగా ఫ్యామిలీ మొత్తం వీక్షించింది. హైదరాబాద్లోని ఏఎంబీ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, తల్లి అంజనాదేవి కలిసి చూశారు. వీళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు.. ఆయన సతీమణి, హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ చిత్రాన్ని తిలకించారు. ఆ తర్వాత దీనిపై స్పెషల్ ట్వీట్లు కూడా చేశారు.
'వకీల్ సాబ్' సినిమాను చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. తన సోదరుడు పవన్ కల్యాణ్తో పాటు మిగిలిన నటీనటులు, టెక్నీషియన్లు ట్విట్టర్ వేదికగా అభినందించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్తో పాటు నిర్మాత దిల్ రాజును తన ఇంటికి పిలిచారు. అంతేకాదు, వాళ్లిద్దరికీ పుష్ప గుచ్చాలు ఇచ్చి సినిమా విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్లు కూడా సినిమా చూసినందుకు గానూ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'వకీల్ సాబ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ను దక్కించుకోవడంతో పాటు రూ. 50 కోట్ల పైచిలుకు కలెక్షన్లను వసూలు చేసి సత్తా చాటింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. మరీ ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో 'బాహుబలి' రికార్డులకు కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా విజయంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.