Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లైఫ్ను రివైండ్ చేసుకొనే శక్తి ఇస్తే.. దానిని భూస్థాపితం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు, ఆచరణ చాలా సహజంగా స్పూర్తిదాయకంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తాజాగా సమంత నిర్వహించే రియాలిటీ షో సందర్భంగా మెగాస్టార్ ఆలోచనలు ఎలా ఉంటాయనే విషయం మరోసారి స్పష్టమైంది. చిరంజీవితో సమంత మాట్లాడుతూ.. జీవితాన్ని రివైండ్ చేసుకొనే ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు మెగాస్టార్ సమాధానం ఇస్తూ..
జీవితాన్ని రీవైండ్ చేసుకొనే అవకాశం ఇస్తే..
నాకు జీవితాన్ని రివైండ్ చేసి వెనక్కి వెళ్లే శక్తి ఇస్తే.. కచ్చితంగా ఒక్క సంవత్సరం వెనక్కి వెళ్లిపోతారు. చైనాకు వెళ్లి ఎక్కడైతే కరోనావైరస్ లీక్ అయిందనే వార్త వచ్చిందో.. ఆ బిల్డింగ్ వద్దకు వెళ్లి దానిని భూస్థాపితం చేసి కరోనావైరస్ రాకుండా చేయాలన్నది నా కోరిక అంటూ చిరంజీవి చెప్పారు.
మానవాళికి గొప్ప గుణపాఠం
2020 సంవత్సరం నాకే కాదు.. ప్రపంచవ్యాపంగా మానవాళికి గొప్ప గుణపాఠం నేర్పింది. ఆరోగ్యపరంగా, అభివృద్ది పరంగా కుంటుపడి పోవడం ఒక ఎత్తు. కానీ ఏదైనా చేయగలమనే గర్వం మనుషుల్లో పెరిగిపోయింది. దానిని అణచడానికి దేవుడో లేదో ప్రకృతో ఓ గుణపాఠం నేర్పడానికి కంటికి కనిపించనంత కరోనావైరస్ సూక్ష్మజీవిని సృష్టించి మనకు ఓ పాఠం నేర్పాడు అని చిరంజీవి పేర్కొన్నారు.
మానవుడికి గర్వభంగం
మానవుడు తన గర్వంతో వాతావరణ సమతూల్యతను దెబ్బ తీస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్కు, అడవులు అంతరించిపోవడానికి కూడా మనిషే కారణం. ఇతర జీవులను బతకనివ్వకపోవడానికి మనిషే కారణం. అలాంటి మానవుడికి గుణపాఠం నేర్పాలని, గర్వభంగం చేయాలని భగవంతుడు భావించి ఉంటాడని నేను భావిస్తున్నాను అంటూ చిరంజీవి తన ఫిలాసఫీని చెప్పారు.
భావితరాలకు మనమిచ్చే ఆస్తి అదే...
ప్రకృతి విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాలి. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలి. నీటిని సంరక్షించుకోవాలి. మొక్కల్ని నాటాలి. భావితరాలకు ఏదైనా ఆస్థి ఇవ్వాలంటే అది కేవలం ప్రకృతి అని నేను భావిస్తాను అని భావోద్వేగంతో చిరంజీవి చెప్పారు.