Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ సెల్యూట్లో సంతృప్తి, గర్వం, ప్రేమ.. కదిలించే ట్వీట్ వేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. సెటైర్లు, పంచ్లు వేయడమే కాదు.. మంచి ఎక్కడున్నా, గొప్ప పని ఎవరు చేసినా అభినందిస్తుంటారు. ఎక్కడ ఏ మూలన ఎవ్వరు ఏ మంచి చేసినా కూడా అది పది మందికి తెలిసేలా ట్వీట్ వేస్తాడు. అలా గతంలో ఓ సారి పోస్ట్ మ్యాన్ గురించి, ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ట్వీట్ వేశాడు. అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
మంచిని ప్రోత్సహించడంలో ముందు..
చిరంజీవి మంచిని ప్రోత్సహించడం ముందుంటారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేశారని తన కంట పడితే చాలు వెంటనే అభినందిస్తుంటాడు. వివరాలేవీ తెలియకపోయినా వెంటనే కనుక్కుని మరీ అభినందిస్తాడు. లాక్డౌన్ సమయంలో చిరంజీవి మంచి మనుషుల గురించి ట్వీట్లు వేశాడు.
పోస్ట్ మ్యాన్, పోలీస్ ఆఫీసర్..
రవాణా సదుపాయం లేని ఓ మారుమూల కుగ్రామానికి తన సర్వీస్ ముగిసేవరకు కూడా కాలినడక వెళ్లి మరీ ఉత్తరాలు పంచేవాడట. సదరు పోస్ట్ మ్యాన్ రిటైర్డ్ అవ్వడంతో చిరు ఆయన సేవలను కొనియాడాడు. లాక్డౌన్ సమయంలో ఓ వృద్దురాలికి ప్రేమగా అన్నం తినిపించిన మహిళా అధికారిణిని చిరు అభినందించాడు.
తాజాగా అలా..
తండ్రి పని చేసే చోటే కూతురు, కొడుకు పై అధికారిగా వస్తే.. అప్పుడు ఆ తండ్రిలో కలిగే ఉద్వేగం, సంతోషం, ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలియజేసే ఫోటో ఒకటి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అరుదైన ఘటన..
ఏపీ పోలీస్..మొదటి రోజు డ్యూటీలో ఇలా ఫ్యామిలీ కలిసింది.. సీఐ శ్యాం సుందర్.. అతని కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని కలిసి గర్వంతో, గౌరవంతో సెల్యూట్ చేశాడు.. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయంటూ ఏపీ పోలీస్ ట్వీట్ చేసింది.
సంతృప్తి ని,గర్వాన్ని,ప్రేమని..
ఆ తండ్రీ కూతుళ్ల ఫోటోను చిరంజీవి షేర్ చేస్తూ.. ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు.. తండ్రి సీఐ శ్యాం సుందర్ గారు.. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.. తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ,తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తి ని,గర్వాన్ని,ప్రేమని చూసాను. శ్యాం సుందర్ గారు.. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను...మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి అంటూ ఎమోషనల్ అయ్యాడు.