Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవి ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి అతనే.. ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. చిరంజీవి వాడినంతగా సోషల్ మీడియాను మరేతర హీరోలు కూడా వాడి ఉండరు. ట్విట్టర్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. గతేడాది ఉగాది సందర్భంగా ట్విట్టర్ ప్రపంచంలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే అందరినీ గడగడలాడించాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ట్విట్టర్ను రఫ్పాడించాడు..
చిరంజీవి తన సెటైర్లు, కామెడీ టైమింగ్లతో వేసే ట్వీట్లు ఓ రేంజ్లో వైరల్ అవుతుంటాయి. ఇక మీమ్స్ వేయడంలోనూ చిరు స్పెషలిస్ట్ అయ్యాడు. తన లీక్స్ మీద సోషల్ మీడియాలో వేసే మీమ్స్ను కూడా చిరు వదల్లేదు. వాటిపైనే మీమ్స్ వేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
ప్రొఫైల్ పిక్స్..
ఇక ట్విట్టర్లో ప్రొఫైల్ పిక్స్ మారుస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ను ఫాలో అవుతుంటాడు. ఇప్పటికే రెండు మూడు డీపీలు మార్చేశాడు చిరు. ఆ మధ్య మీసం తీసేసిన ఫోటోలు, గుండు చేయించుకున్నట్టుగా షాక్ ఇచ్చిన ఫోటోలను ప్రొఫైల్ పిక్స్గా పెట్టుకున్నాడు.
రామ్ చరణ్ను..
చిరంజీవి మొదటగా రామ్ చరణ్ ఒక్కడినే ఫాలో అయ్యేవాడు. మధ్యలో ఏమైందో ఏమో గానీ రామ్ చరణ్ను కూడా అన్ ఫాలో అయ్యాడు. అలా కొన్ని రోజులు ఎవ్వరినీ ఫాలో అవ్వలేదు చిరంజీవి. కానీ తాజాగా మరో వ్యక్తిని ఫాలో అవుతున్నాడు.
రామ్ జోగయ్య శాస్త్రిని..
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఒక్కరినే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఫాలో అవుతున్నాడు చిరంజీవి. ఇదే విషయాన్ని ఓ అభిమాని రామజోగయ్య శాస్త్రికి తెలియపరిచాడు. దాంతో ఆ పాటల రచయిత ఎమోషనల్ అయ్యాడు.
ఎప్పటికీ రుణపడి..
మెగా స్టార్ చిరంజీవి సర్ చూపిస్తోన్న ఈ మెగా ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. కొండంత సంతోషంగా ఉన్నాను అంటూ రామ జోగయ్య శాస్త్రి ఎమోషనల్ అయ్యారు. ఈ మధ్యే ఆచార్య లాహేలాహే సాంగ్తో రామ జోగయ్య శాస్త్రి మరో సారి ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.