ఆమె కోసం చిరంజీవి అతిధి పాత్రలో....
ఎక్స్ పీరియన్డ్స్ యాక్టర్స్ నటకిరిటీ రాజేంద్రప్రసాద్, సుహాసిని మణిరత్నం, ఈ ఇద్దరూ జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జొన్నాడ రామ్మూర్తి నిర్మాతగా దినేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కథ పరంగా రాజేంద్ర ప్రసాద్ మరియు సుహాసిని ఇక ఇన్ కమ్ టాక్స్ ఆఫిసర్ కాగా మరొకరు బ్యాంక్ ఆఫీసర్. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించడానికి ఓప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్, సుహాసిని కలిసి చిరంజీవిని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా కోరారట. వీళ్ళ కోరిక మేరకు చిరంజీవి నటించడానికి అంగీకరించి నట్టు సమాచారమ్. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెర పై చిరు మళ్ళీ కనువిందు చేస్తాడని చెప్పొచ్చు. ఈ చిత్రంలో నరేష్, రఘుబాబు, ఝాన్సీ, తదితరులు నటించనున్నారు.
More from Filmibeat
చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ సుహాసిని దినేష్ బాబు జొన్నాడ రామ్మూర్తి chiranjeevi rajendra prasad suhasini dinesh babu jonnada ramamurthy


Click it and Unblock the Notifications











