Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నందులు వ్యవహారంపై దాసరికి..చిరంజీవి చురకలు
"నంది అవార్డులు వస్తాయి పోతాయి. కావాలని వాటిని తెచ్చుకోకూడదు" అంటూ దాసరి నారాయణరావు పై పరోక్ష వ్యాఖ్యలు చేసారు చిరంజీవి. సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'ఆరెంజ్' చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. నంది అవార్డులు వాటంతట అవే రావాలని చెప్పారు. వాటికంటే కూడా ప్రేక్షకుల అభిమానమే గొప్ప అన్నారు.అలాగే ప్రేక్షకులు, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చి, ఆ తర్వాత మనలోని నటుణ్ణి సంతృప్తిపరచుకునే పాత్రలు చేయాలి. నేను 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' లాంటివి అలా చేసినవే. వాటికి నంది అవార్డులు వచ్చాయి. కానీ కావాల్సింది ప్రేక్షకుల రివార్డులు. నంది అవార్డులు వస్తాయి, పోతాయి. కావాలని వాటిని తెచ్చుకోకూడదు. వాటంతట అవే రావాలి. వాటికంటే ప్రేక్షకుల అభిమానమే గొప్పది'' అని చెప్పారు. ఇక ఇటీవల 2009 సంవత్సరానికి నంది అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును రాంచరణ్కి కాకుండా 'మేస్త్రి' చిత్రానికి గాను దాసరి నారాయణరావుకు ప్రకటించడంపై చిరంజీవి అభిమాన సంఘాలు, పీఆర్పీ శ్రేణులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. పైగా 'మేస్త్రి' చిరంజీవికి వ్యతిరేకంగా తీసిన చిత్రమనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.