Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి మంచాయనే కానీ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శాసన సభలో మాట్లాడినా, మరెక్కడ మాట్లాడినా నవ్వులు వెల్లివిరుస్తాయి. ఈసారి కూడా మీడియాతో మాట్లాడుతూ సెటైర్ లు విసిరారు. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తుందనే తెలుగుదేశం ఆరోపణను ఆయన ముందు ప్రస్తావిస్తే 1983కు ముందు ఈ కుల గజ్జి ఎక్కడుందట...చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచే కులగజ్జి రాజకీయాలు మొదలయ్యాయి. వాళ్ల గజ్జి మాకెందుకు అంటిస్తారు. ఆ గజ్జి వాళ్లనే ఉంచుకోమనండి అని నవ్వారు.
చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వెనకాల కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని వస్తున్న వార్తను ప్రస్తావించగా...మాకేం పని ఆ పిల్లకాయలేదో పెళ్లి చేసుకుంటే మేమందుకు గోకుతాం..చిరంజీవి పార్టీ పెడితే నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. ఎన్టీఆర్ లాగా చిరంజీవి పార్టీ పెడతారా అన్న ప్రశ్నకు పెద్దాయన ఎక్కడ...చిరంజీవి ఎక్కడ..చిరంజీవి మంచాయనే కానీ రాజకీయాలు వేరుగా ఉంటాయి..అని బదులిచ్చారు.