Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి, శ్రీదేవి, జయప్రద ఐనాక్స్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : జగదేక వీరుడు...అతిలోక సుందరిగా పాపులర్ అయిన జోడీ మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ శ్రీదేవి. కూడా చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ లోని కాచిగూడ వద్ద రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన ఐనాక్స్-మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ల సముదాయం ప్రారంభోత్సవం ఇందుకు వేదికైంది.
వీరితో పాటు ఏఎన్నార్, డి రామానాయుడు, జయప్రద, బోణీ కపూర్ మరియు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సహా పలువురు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
చిరంజీవి మాట్లాడుతూ...'సుబ్బిరామిరెడ్డి చేసే ప్రతి పనిలోనూ అప్ డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 31ఏళ్ల క్రితమే అద్భుతమైన టెక్నాలజీతో ఆయన పరమేశ్వరి మహేశ్వరి థియేటర్లను నిర్మించారు. ఇప్పుడు అదే పేరు మీద మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మించడం ఆనందంగా ఉంది' అన్నారు. అక్కినేని నాగేశ్వర రావు మాట్లాడుతూ 'సుబ్బిరామిరెడ్డి ఏం చేసినా అందులోఅర్థం, పరమార్తం ఉంటుంది. నేటి తరం వారు ఇలాంటి థియేటర్లనే ఇష్ట పడుతున్నారు' అని చెప్పుకొచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ..'31ఏళ్ల క్రితం ఈ థియేటర్ ప్రారంభోత్సవానికి వచ్చాను. మళ్లీ 31 ఏళ్ల తర్వాత అదే పేరుతో మల్టీ ప్లెక్స్ ఓపెనింగుకు రావడం ఆనందంగా ఉంది' అన్నారు.
ముఖ్యంగా చిరంజీవి శ్రీదేవి చేయి పట్టుకుని మరీ జ్యోతిప్రజ్వలన చేయడం గమనార్హం. ఈ సీన్ చూసిన వారంతా సినిమాల్లో శ్రీదేవి తనతో నటించిన చనువుతోనే చిరంజీవి అలా చేసి ఉంటారని చర్చించుకుంలున్నారు. ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ నేతలు రాక నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ముగిసే వరకు ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీదేవి చేయి పట్టుకుని జ్యోతి వెలిగిస్తున్న చిరంజీవి
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కిరణ్, కేంద్ర మంత్రి ఆజాద్, చిరంజీవి, ఎఎన్ఆర్, డి రామానాయుడు, శ్రీదేవి, జయప్రద తదితరులు
శ్రీదేవి-బోణి కపూర్ దంపతులను ఆహ్వానిస్తున్న సుబ్బిరామిరెడ్డి
అలనాటి స్టార్ జోడీ ఎఎన్ఆర్, జయప్రద...పక్కనే శ్రీదేవి దంపతులు
జయప్రద, శ్రీదేవి చిట్ చాట్