twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మి ని కలిసిన చిరంజీవి(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: తన కుమారుడు రామ్ చరణ్ చేస్తున్న నాయక్ సెట్స్ పై చిరంజీవి...ఛార్మిని కలుసుకున్నారు. నాయక్ షూటింగ్ చూద్దామని వెళ్లిన చిరంజీవికి అక్కడ ఛార్మితో సాంగ్ జరుగుతూంది. ఈచిత్రంలో 'నెల్లూరే..' అనే ఐటం సాంగులో చార్మి రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులు వేసింది. మాంచి మాస్ బీట్లతో సాగే ఈ పాటను ఇటీవలే హైదరాబాద్‌‌లో చిత్రీకరణ జరిపారు. చిరు ఆ సెట్స్ మీదకు వెళ్లి యూనిట్ కు ఉత్సాహాన్ని ఇచ్చారు.

    ఈ పాట గురించి చార్మి తన ట్విట్టర్లో పేర్కొంటూ.... 'నాయక్ సినిమా కోసం ఫుల్ నైట్ షూటింగులో పాల్గొన్నాను. రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంగు సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది. సంక్రాంతి వరకు వెయిట్ చేయండి' అంటూ చార్మి ట్వీట్ చేసింది.

    ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా.... అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే పాటను రీమిక్స్‌ చేసారు.

    యూనివర్శల్‌ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    
 Chiranjeevi has visited the sets of Naayak recently when the shooting of Nellore song was going on Ram Charan and Charmme. Nayak film is going to release for Sankranthi 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X