Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. చిరు వేసే ట్వీట్లలో ఎంత వెటకారం, ఫన్ ఉంటుందో అందరూ రుచి చూసి ఉంటారు. గతేడాది చిరంజీవి ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఓ ఆట ఆడేసుకున్నాడు. అలా చిరంజీవి వేసే ట్వీట్లకు, పంచ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎలాంటి వారికైనా సరే చిరు కౌంటర్ ఇస్తుంటాడు. అలాంటి చిరు తాజాగా ఓ పోస్ట్ చేశాడు.
వరుసగా సినిమాలు..
చిరంజీవి సైరా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అలా అక్కడ పెరిగిన గ్యాప్ను పూడ్చేందుకు వరుసగా ప్రాజెక్ట్లను సెలెక్ట్ చేసుకున్నాడు. కొరటాల శివతో ఆచార్య సినిమా అని ప్రకటించి రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇలా పెరుగుతున్న గ్యాప్ను సెట్ చేసుకునేందుకు వరుసగా చిత్రాలను లైన్లో పెట్టాడు.
మూడు ప్రాజెక్ట్లు..
ఆచార్య సినిమా తరువాత చిరంజీవి వరుసగా సినిమాలను లైన్లో పెట్టేశాడు. అన్నింటి కంటే ముందుగా లూసిఫర్ సినిమాను ఓకే చేశాడు. అయితే లూసిఫర్ రీమేక్ విషయంలో డైరెక్టర్ను సెలెక్ట్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. మొదటగా సుజిత్ని అనుకున్నారు మధ్యలో వినాయక్ చేతికి వెళ్లింది. మధ్యలో హరీష్ శంకర్ పేరు కూడా వచ్చింది.
చివరకు అలా..
చివరకు జయం మోహన్ రాజాను లూసిఫర్ రీమేక్కు దర్శకుడిగా ఫిక్స్ చేశారు. అలా ఎవ్వరూఊహించనిపేరు బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే లూసిఫర్ తరువాత చిరు వేదాళం రీమేక్లో నటించనున్నాడు. ఆ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నాడు.
లూసిఫర్ ప్రారంభం..
చిరంజీవి లూసిఫర్ చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి పాల్గొన్నాడు. ఫిబ్రవరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోన్నట్టు ప్రకటించారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవంలో ఓ అరుదైన ఘట్టం జరిగింది. ఇదే విషయం గురించి చిరంజీవి తాజాగా ట్వీట్ చేశాడు.
నలుగురు దర్శకులు..
లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవంలో చిరంజీవి నాలుగు చిత్రాల దర్శకులు కలిశారు. కొరటాల శివ, మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీలు కలిశారు. వారితో కలిసి దిగిన ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశాడు. ఈ నలుగురు దర్శకులు ఫంటాస్టిక్.. చార్ కదమ్ అంటూ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.