Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చరిత్ర సృష్టించిన ఆచార్య మూవీ.. దేశ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. చిరంజీవి మూవీకే ఘనత
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఆచార్య మూవీ షూటింగ్ స్థాయిలో ఉండగానే రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. లాక్డౌన్ తర్వాత సెట్స్పైకి వెళ్లిన ఈ చిత్రం ఎలాంటి విశేషాలను సంతరించుకొన్నదంటే...
దేవుడు మాన్యాల కథా నేపథ్యంగా
సైరా చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దేవుడి మాన్యాల కథా నేపథ్యంగా సాగుతుందనే ప్రచారం జరుగుతున్నది. దేవాలయాలకు సంబంధించిన భూముల నేపథ్యంలో సాగే అవినీతి అక్రమాలను ఎదురించే పాత్రలో చిరంజీవి కనిపిస్తారనేది తాజా సమాచారం.
వివాదం నుంచి బయటపడి
ఇటీవల ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత మీడియాకు ఎక్కడంతో గందరగోళం నెలకొన్నది. మీడియాలో ముఖాముఖిగా రచయిత, దర్శకుడు కొరటాల శివ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆ వివాదం సద్దుమణిగించింది. ఈ క్రమంలో లాక్డౌన్ తర్వాత షూటింగలకు అనుమతి ఇవ్వడంతో శరవేగంగా షూటింగు జరుగుతున్నది.
20 కోట్లతో 20 ఎకరాల్లో
ఆచార్య
సినిమా
కోసం
వేసిన
సెట్
ప్రస్తుతం
ఓ
రికార్డుగా
మారింది.
దేశ
చరిత్రలోనే
గతంలో
మునుపెన్నడూ
లేని
విధంగా
భారీ
సెట్ను
వేసినట్టు
సమాచారం.
ఈ
సినిమా
కోసం
రూ.20
కోట్లతో
సుమారు
20
ఎకరాల్లో
సెట్
వేసినట్టు
తెలిసింది.
ప్రస్తుతం
ఈ
సెట్లోనే
సన్నివేశాలను
చిత్రీకరిస్తున్నట్టు
తెలుస్తున్నది.
ఆలయ నగరి సెట్ నిర్మాణం
ఆచార్య సినిమా కోసం ఆలయ నగరి సెట్ను యూనిట్ నిర్మించింది. ఈ సెట్లోనే సినిమాకు సంబంధించిన ప్రధాన, మెజారిటీ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇలాంటి సెట్ వేయడం దేశ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు అని చిత్ర యూనిట్ వర్గాలు ధృవీకరించాయి.
నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు:
చిరంజీవి,
కాజల్
అగర్వాల్,
రాంచరణ్,
దివి
వద్యా,
సోనుసూద్
తదితరులు
దర్శకత్వం:
కొరటాల
శివ
మ్యూజిక్:
మణిశర్మ
సినిమాటోగ్రఫి:
తిరు
ఎడిటింగ్:
నవీన్
నూలి
ప్రొడక్షన్
కంపెనీ:
కొణిదెల
ప్రొడక్షన్
కంపెనీ,
మ్యాట్నీ
ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్:
2021