చరిత్ర సృష్టించిన ఆచార్య మూవీ.. దేశ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. చిరంజీవి మూవీకే ఘనత
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఆచార్య మూవీ షూటింగ్ స్థాయిలో ఉండగానే రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. లాక్డౌన్ తర్వాత సెట్స్పైకి వెళ్లిన ఈ చిత్రం ఎలాంటి విశేషాలను సంతరించుకొన్నదంటే...

దేవుడు మాన్యాల కథా నేపథ్యంగా
సైరా చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దేవుడి మాన్యాల కథా నేపథ్యంగా సాగుతుందనే ప్రచారం జరుగుతున్నది. దేవాలయాలకు సంబంధించిన భూముల నేపథ్యంలో సాగే అవినీతి అక్రమాలను ఎదురించే పాత్రలో చిరంజీవి కనిపిస్తారనేది తాజా సమాచారం.

వివాదం నుంచి బయటపడి
ఇటీవల ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత మీడియాకు ఎక్కడంతో గందరగోళం నెలకొన్నది. మీడియాలో ముఖాముఖిగా రచయిత, దర్శకుడు కొరటాల శివ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆ వివాదం సద్దుమణిగించింది. ఈ క్రమంలో లాక్డౌన్ తర్వాత షూటింగలకు అనుమతి ఇవ్వడంతో శరవేగంగా షూటింగు జరుగుతున్నది.

20 కోట్లతో 20 ఎకరాల్లో
ఆచార్య సినిమా కోసం వేసిన సెట్ ప్రస్తుతం ఓ రికార్డుగా మారింది. దేశ చరిత్రలోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సెట్ను వేసినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రూ.20 కోట్లతో సుమారు 20 ఎకరాల్లో సెట్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సెట్లోనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఆలయ నగరి సెట్ నిర్మాణం
ఆచార్య సినిమా కోసం ఆలయ నగరి సెట్ను యూనిట్ నిర్మించింది. ఈ సెట్లోనే సినిమాకు సంబంధించిన ప్రధాన, మెజారిటీ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇలాంటి సెట్ వేయడం దేశ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు అని చిత్ర యూనిట్ వర్గాలు ధృవీకరించాయి.

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాంచరణ్, దివి వద్యా, సోనుసూద్ తదితరులు
దర్శకత్వం: కొరటాల శివ
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: తిరు
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ కంపెనీ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్: 2021


Click it and Unblock the Notifications











