Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకిస్తున్న చిరంజీవి లేటెస్ట్ లుక్.. వైరల్ పిక్.. రివీల్ చేసిన ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే సైరా షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చే లుక్లో దర్శనమిచ్చాడు. ఉపాసన బీ పాజిటివ్ మ్యాగజైన్ కవర్ పేజీగా చిరు లేటెస్ట్ లుక్ ఉంచారు. ఈ లుక్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఉపాసన తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉపాసన
ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే మెగా కోడలు, రామ చరణ్ సతీమణి ఉపాసన ఫిట్నెస్, హెల్త్కు సంబంధించి 'బీ పాజిటివ్' అనే మ్యాగజైన్ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఇందులో భాగంగా తాజాగా చిరంజీవి లేటెస్ట్ లుక్ పబ్లిష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సరికొత్త యంగ్ లుక్.. కుర్ర హీరోలు ఈర్ష పడేలా
సీనియర్ హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి ఈ లుక్లో కుర్ర హీరోలకే ఈర్ష కలిగేలా ఉన్నాడు. స్లిమ్ లుక్లో వెరీ డీసెంట్ గా కనిపిస్తున్న చిరంజీవి వయసు ఏ మాత్రం బయటపడటం లేదు. 30 ఏళ్ల క్రిందట చిరు ఎలా ఉన్నదో అచ్చం అలాగే యంగ్ లుక్లో కనిపిస్తున్న చిరంజీవిని చూసి షాకవుతున్నారు ప్రేక్షకులు.
|
కొరటాల శివ సినిమా కోసమేనా..
మెగాస్టార్ తన 152 వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ సినిమా చిరు బర్త్ డే సందర్బంగా ఆగస్టు 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు స్లిమ్లో కనిపించనున్నాడని, ఆ మేరకు కసరత్తులు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా కనిపించిన ఆయన స్లిమ్ లుక్.. ఆ వార్తలు నిజమే అని తేల్చేశాయి.
సైరా నరసింహా రెడ్డి మూవీ
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రామ్ చరణ్ నిర్మాణంలో సైరా నరసింహా రెడ్డి మూవీ తెరకెక్కుతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.