Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'సైరా' బంపర్ ఆఫర్.. ఇక మెగా అభిమానులకు పండగే పండగ!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆ తేదీ ఎప్పుడొస్తుందా.. అని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు. ఇంతలో సైరా బంపర్ ఆఫర్ గురించి తెలియడంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? ఎవరికీ వర్తిస్తుంది? పూర్తి వివరాలు చూద్దామా..
బంపర్ ఆఫర్.. ఆ ఒక్క రోజు మాత్రమే
'సైరా నరసింహా రెడ్డి' సినిమా టికెట్ కొనే వారికి బంపర్ ఆఫర్ ఒకటి ఊరిస్తోంది. ఈ సినిమా కోసం ఒక టికెట్ కొంటే మరో టికెట్ను ఉచితంగా ఇవ్వబోతున్నారు. అయితే అది మన దేశంలో మాత్రం కాదు. యూఎస్లో.. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకొని ఆన్లైన్ మార్కెట్లో పెట్టేశారు కూడా. అయితే ఈ ఆఫర్ సైరా రిలీజ్ రోజు మాత్రమే కావడం గమనార్హం.
చిరంజీవి కెరీర్లో ఇదే మొదటిసారి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వస్తున్న మొదటి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. అందుకే ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫాన్స్. అందరి అంచనాలను మించి సినిమా అవుట్ ఫుట్ ఉండాలని మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా భాగమవుతున్నారు ఈ తండ్రీ కొడుకులు.
టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా
ఇక సైరా సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. ఏకంగా ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేయడం. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇలా ఓ తెలుగు సినిమా ఏకంగా 5 భాషల్లో ఒకేసారి విడుదల కానుండటం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి.
సైరా నరసింహా రెడ్డి మూవీ
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.