Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
మీరు చూపిన కరుణకు హృదయపూర్వక ధన్యవాదాలు: చిరంజీవి
కరోనా కల్లోలంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా ఉంటూ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ పిలుపు మేరకు టాలీవుడ్ నుంచి ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు స్పందించి తమ తమ విరాళాలు ప్రకటించారు. తాజాగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా.. ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను చెబుతూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది.
Hearty Thanks to@NameisNani 30 Lacs@alluarjun 20 Lacs#Srimitrachowdary 5 lacs@iamSushanthA 2 lacs@vennelakishore 2 lacs@sampoornesh 1 lac
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 30, 2020
for your compassion for the Film workers.#CoronaCrisisCharity
నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్లు చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖులు కదలిరావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వేలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి. జనం భయాందోళనకు గురవుతున్న ఈ పరిస్థితుల్లో పలువురు సినీ ప్రముఖులు కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూ అందరిలో ధైర్యం నింపుతున్నారు.