Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సజ్జనార్ చేతిలో ఆయుధం అంటే వామ్మో.. నవ్వుల పంట పండిచిన చిరంజీవి
కరోనాను జయించి పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన దాతలను సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (ఎస్సీఎస్సీ) అధ్వర్యంలో సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ స్పూర్తిదాయక సందేశాన్ని అత్యంత ఆహ్లాదకరంగా, నవ్వులతో ముంచెత్తు ఇచ్చారు. దాతలకు స్ఫూర్తినిస్తూ ఆద్యంత చలాకీగా చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నవ్వుల పంటను పండించారు. చిరంజీవి మాట్లాడుతూ ..
ప్లాస్మా దాతలకు సరైన సమాచారం.
కరోనా పేషెంట్లకు ప్లాస్మా అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్లాస్మా ఎక్కడ లభ్యమవుతుంది. ప్లాస్మా కోసం ఎవరిని సంప్రదించాలనే పరిస్థితుల్లో సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (SCSC), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా donateplasma.scsc.in అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా అవసరమైన వాళ్లు, ప్లాస్మాదాతలు కూడా తమ పేర్లను నమోదు చేసుకొనే విధంగా వెసలుబాటును కల్పించారు.
సైబరాబాద్ పోలీసుల అధ్వర్యంలో
సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ ఏర్పాటు చేసిన donateplasma.scsc.in వెబ్సైట్కు మంచి ఆదరణ లభిస్తున్నది. దాతలు, గ్రహీతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలో దాతలను చిరంజీవి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్లాస్మా దాతలను కొనియాడారు.
సీపీ సజ్జనార్ కోరితే నేను..
ప్లాస్మా దాతలకు స్ఫూర్తినిచ్చేలా ఓ సందేశం ఇవ్వాలని సీపీ సజ్జనార్ నన్ను కోరారు. ఇలాంటి కార్యక్రమంలో మాట్లాడి దాతలకు స్పూర్తినిచ్చేలా.. అలాగే నా మాటల విని ఆచరించేలా చేసేందుకు ఆయనతో ఈ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. తెల్ల రక్తకణాల్లో ప్లాస్మా కణాలు ఉంటాయి. వాటిని రోగికి ఇస్తే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని అని చిరంజీవి తెలిపారు.
నా ఇంటిలో నలుగురికి కరోనా
తన ఇంటిలో నలుగురికి కరోనా సోకిన విషయాన్ని హాస్యభరితంగా చెప్పుతూనే జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి కష్టాలు అనుభవిస్తారనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన ఇంటిలో పనిచేసే పని మనుషులు కూడా కరోనా బారిన పడ్డారు. వారిని క్వారంటైన్లో పెట్టి చికిత్స అందించాం. ఇప్పుడు వారంతా కోలుకొన్నారు అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్లాస్మా డొనేషన్ ప్రొగ్రాంను యజ్ఞంలా
ఇక ప్లాస్మా డోనేషన్ కార్యక్రమాన్ని సజ్జనార్ గారు ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అందుకు మనమంతా ఆయనను కరతాళ ధ్వనులతో అభినందించాలి అని చిరంజీవి అన్నారు. ఆయనతో నాకు పరిచయం ఎక్కువ లేదు. నా గురించి ఆయనకు.. ఆయన గురించి నాకు చాలా తెలుసు. ఆయన నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా ఆనందంగా ఉంది అన్నారు.
Recommended Video
సజ్జనార్ నన్ను ఆయుధంలా అంటూ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఇంక ముందు ఏ కార్యక్రమం ప్రారంభించిన నన్ను పిలుస్తే తప్పకుండా హాజరవుతాను. పది మందికి ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలకు నన్ను ఓ వెపన్ (ఆయుధం)లా ఉపయోగించుకోవాలి. ఆయన చేతిలో వెపన్ అంటే కొంచెం అని చిరంజీవి అనగానే నవ్వులతో మునిగిపోయారు. తమ ప్రచార కార్యక్రమాలకు నన్ను సాధనంగా ఉయోగించుకొన్నందుకు మీకు రుణపడి ఉంటాను అని సజ్జనార్తో చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరంజీవి స్పీచ్ ఇంటర్నెట్ మాధ్యమాల్లో, యూట్యూబ్లో వైరల్గా మారింది.