Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
4500 మంది డ్యాన్సర్లు, 14 రోజులు.. సైరాలో అదే అదిరిపోయే ఘట్టం
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా సైరా. తొలి స్వతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా చిత్రాన్ని భారీ బడ్జెట్తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..
విజువల్ వండర్గా చిత్రీకరించిన సైరాలో.. ఎంతో మంది గొప్ప నటులు గొప్ప గొప్ప పాత్రలను పోషించారు. అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో అత్యంత భారీ ఎత్తున తెరకక్కించారు. రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, వివి వినాయక్, కొరటాల శివ, రాజమౌళిలాంటి దిగ్గజాలు అతిథులుగా విచ్చేశారు.
వైరల్ అవుతున్న టైటిల్ సాంగ్
ఒకప్పటి కాలానికి మనల్ని తీసుకుపోయేందుకు.. సైరా చిత్రయూనిట్ భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. యుద్ద సన్నివేశాలకు ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఉన్నవే మూడు పాటలని సమాచారం. అందులో ఒకటి సైరా టైటిల్ సాంగ్.. అది ప్రీ రీలిజ్ ఈవెంట్ నాడు రిలీజ్ చేశారు. అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రయూనిట్ మరో విషయాన్ని ప్రకటించారు.
4600 డ్యాన్సర్లతో.. 14 రోజుల పాటు షూటింగ్
ఈ చిత్రంలోని జాతర సాంగ్కు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పాట చిత్రీకరణకు వీరు పడ్డ కష్టం మామూలుది కాదని అర్థమవుతోంది. 4600 మంది డ్యాన్సర్లతో.. 14 రోజుల పాటు ఈ పాటను షూట్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అంత మందితో అన్ని రోజుల పాటు ఒక్క పాటను షూట్ చేశారంటే.. దానికి ఎంత ప్రత్యేకత ఉందో ఇట్టే తెలిసిపోతోంది. మరి ఈ విజువల్ వండర్ను తెరపై కచ్చితంగా చూడాల్సిందేనని అనిపిస్తోంది. అలాగే 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్లతో 35 రోజుల పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసిన సంగతి తెలిసిందే.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి...
ఈ మూవీ ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. రెండు గంటల యాభై నిమిషాల నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్ గా పనిచేశారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది