Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా పరిశ్రమ కోలుకునేందుకు నిర్ణయాలు.. సీఎం జగన్కు చిరు ధన్యవాదాలు
సినీ పరిశ్రమ అభివృద్ది, కరోనా వైరస్ వల్ల దెబ్బ తిన్న చిత్రసీమను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. ఈ మేరకు నేడు సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇప్పటికే షూటింగ్లకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మరికొన్ని తాయిలాలను ప్రకటించింది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమ ఏపిలో రాణించటానికి సిఎం జగన్ ప్రత్యేకమైన జివో రిలీజ్ చేశారు. నంది అవార్డులపై కూడా సిఎం జగన్ తో చర్చించారు. 2019-2020 నంది అవార్డుల వేడుక కూడా త్వరలో జరగనుంది. తెలంగాణాతో పాటు ఏపిలో కూడా జూన్ 15 నుండి షూటింగ్ జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్కు సోషల్ మీడియా వేదికగా చిరు ధన్యవాదాలు తెలిపారు.
చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ..' సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సి ఎం శ్రీ వై ఎస్ జగన్ గారికి కృతఙ్ఞతలు. షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు'అని పేర్కొన్నారు.