Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేలాదిమంది దినసరి కూలీలకు ఊరట కలిగేలా నిర్ణయం.. కేసీఆర్కు చిరంజీవి కృతఙ్ఞతలు
లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను ఎంతగానో దెబ్బతింది. అలాంటి చిత్రసీమను ఆదుకునేందుకు తిరిగి షూటింగ్స్ను ప్రారంభించడం, థియేటర్స్ను ఓపెన్ చేయడం లాంటి అంశాలపై సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ భేటీ మంత్రి తలసాని ఆధ్వరంలో కేసీఆర్ నేతృత్వంలో జరిగింది. లాక్డౌన్ నిబంధనలను అనుసరించి, వీలైనంత తక్కువ మందితో షూటింగ్స్ జరపాలంటూ కేసీఆర్ సూచించారు. కేసీఆర్ సానుకూల స్పందనపై మెగాస్టార్ చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు.
దశలవారీగా..
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సిఎం చెప్పారు.
థియేటర్స్ విషయమై..
తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం సూచించారు. ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం చెప్పుకొచ్చారు.
భేటీలోని టాలీవుడ్ ప్రముఖులు..
తలసాని
నేతృత్వంలో
కేసీఆర్
అధ్యక్షతన
జరిగిన
ఈ
భేటీలో
టాలీవుడ్
ప్రముఖులు
పాల్గొన్నారు.
వీరిలో
మెగాస్టార్
చిరంజీవి,నాగార్జున,
రాజమౌళి,త్రివిక్రమ్,
N.
శంకర్,
అల్లుఅరవింద్,
దిల్
రాజు,రాధాకృష్ణ,
C.కళ్యాణ్,
సురేష్
బాబు,
కొరటాల
శివ,
జెమినికిరణ్,
మెహర్
రమేష్
వంటి
వారున్నారు.
చిరు కృతఙ్ఞతలు..
షూటింగ్స్ ప్రారంభించడంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్కు చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు తెలిపారు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చార'ని చెప్పుకొచ్చారు.