Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
జగన్తో చిరంజీవి భేటీ.. క్లారిటీ వచ్చేసింది.. అదే నిర్ణయం తీసుకోనున్నారా..?
Recommended Video
ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలుత అప్పుడే అనుకున్నారు కానీ చివరకు
చిరంజీవి- జగన్ భేటీ ఈనెల 11 (ఈ రోజే) ఉదయం 11 గంటలకు ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ చివరకు దాన్ని ఈ నెల 14 వ తేదీకి వాయిదా వేశారు. అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి సమావేశం అక్టోబర్ 14వ తేదీ జరగనుంది. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
జగన్తో చిరంజీవి భేటీ.. కారణాలేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే జగన్ని చిరంజీవి కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం సైరా నరసింహా రెడ్డి విజయాన్ని ఆయనతో పంచుకొని, సినిమా చూడమని కోరేందుకే ఈ భేటీ అని టాక్ నడుస్తోంది. అలాగే సైరాకు జగన్ అందించిన సహకారం పట్ల కూడా చర్చ సాగనుందని తెలుస్తోంది.
సైరా జైత్రయాత్ర.. కలెక్షన్ల సునామీ
చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ప్రముఖులను కలుస్తూ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను కలిసి సైరా సినిమా చూడాలని కోరారు. ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ను కలవబోతున్నారు.
కంగ్రాట్స్.. స్పెషల్ థ్యాంక్స్
జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి చిరంజీవి ఆయన్ను నేరుగా కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్కు కంగ్రాట్స్ కూడా చెప్పనున్నారట చిరు. సైరా రిలీజ్ సందర్భంగా ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు గాను చిరంజీవి థ్యాంక్స్ చెప్పనున్నారు. అలాగే సైరా సినిమాను చూడవలసిందిగా జగన్ను మెగాస్టార్ కోరనున్నారు.
కీలక నిర్ణయం తీసుకోనున్నారా..?
ఇక జగన్ - చిరంజీవి భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకోనుందని టాక్ నడుస్తోంది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కించారు. దీంతో ఏపీ ప్రభుత్వం సైరాకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో!.