Don't Miss!
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడలా ఇప్పుడలా.. చిరంజీవికి ఏమైంది.. రామ జోగయ్య శాస్త్రికి షాక్!
చిరంజీవి, ట్విట్టర్, రామ జోగయ్య శాస్త్రి ఈ మూడు అంశాలు నిన్నంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి రామజోగయ్య శాస్త్రి అని వార్తలు వైరల్ అయ్యాయి. మామూలుగా అయితే చిరంజీవి సోషల్ మీడియాలో ఎవ్వరినీ ఫాలో అవ్వడు. అంతకు ముందు రామ్ చరణ్ను మాత్రమే ఫాలో అయ్యేవాడు.ఏమైందో ఏమో గానీ మళ్లీ ఆ లిస్ట్ జీరోగా మారింది. తాజాగా ఇలా మరోసారి అందరికీ చిరు షాక్ ఇచ్చాడు.
నిధి అగర్వాల్ క్లీవెజ్ షో... అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరి
సోషల్ మీడియాలో యాక్టివ్..
చిరంజీవి సోషల్ మీడియాను ఎలా వాడేస్తుంటాడో అందరికీ తెలిసిందే. చిరు వేసే సెటైర్లు, కౌంటర్లకు ట్విట్టర్లో సపరేట్ క్రేజ్ ఉంటుంది. ట్విట్టర్లోకి గతేడాది ఉగాది సందర్భంగా చిరు అడుగుపెట్టేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దడదడలాడిస్తూనే ఉన్నాడు.
ఫాలోవర్ల విషయంలో..
చిరంజీవి ట్విట్టర్లో భారీగానే ఫాలో అవుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో చిరు మిలియన్ మార్క్ను చేరుకోబోతోన్నాడు. అయితే చిరును ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. కానీ చిరంజీవి ఫాలో అయ్యే వారి సంఖ్యలోనే అందరికీ తేడా కొడుతోంది.
అప్పుడు అలా..
గతంలో ఓ సారి చిరంజీవి రామ్ చరణ్ను మాత్రమే ఫాలో అయ్యే వాడు. ఫాలోవర్ల సంఖ్య ఒకటిగా చూపిస్తూ.. అందులో రామ్ చరణ్ మాత్రం ఉండేవాడు. మధ్యలో ఏమైందో ఏమో గానీ రామ్ చరణ్ను కూడా అన్ ఫాలో అయ్యాడు. అలా ఫాలోవర్ల సంఖ్య జీరోగా మారింది.
తాజాగా ఇలా..
తాజాగా మళ్లీ చిరంజీవి ఫాలోవర్ల సంఖ్య ఒకటిగా మారింది. అందులో ఈ సారి రామ జోగయ్యా శాస్త్రి పేరు ఉంది. ఇలా చిరంజీవి ఫాలో అయ్యే ఏకైక వ్యక్తిగా రామ జోగయ్యా శాస్త్రి నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసించారు. వాటికి రామ జోగయ్యశాస్త్రి కూడా స్పందించాడు. ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. కొండంత సంతోషంగా ఉన్నాను అని ఎమోషనల్ అయ్యాడు.
మళ్లీ అన్ ఫాలో..
తాజాగా చిరంజీవి ఫాలోవర్ల సంఖ్య మళ్లీ జీరోకు వచ్చింది. రామ జోగయ్య శాస్త్రిని అన్ ఫాలో అయ్యాడు. నిన్న వార్తలు వైరల్ అవ్వడం ఈరోజు ఇలా అన్ ఫాలో అవ్వడంతో అందరూ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇది చిరంజీవి చేశాడా? లేదా ఆయన టీం చేస్తోందా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తనను మాత్రమే ఫాలో అవుతున్నాడని రామ జోగయ్యా శాస్త్రి సంతోషించే లోపే ఇలా షాక్ తగిలింది.