చిరంజీవి యూఎస్ఏ ట్రిప్? అందుకే అంటూ గుసగుసలు!
చిరంజీవి దంపతులు యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ట్రిప్పులో అల్లు అరవింద్ దంపతులు కూడా ఉన్నారని టాక్.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చైనా టూర్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. 80ల్లోని సౌతిండియా స్టార్స్ అంతా కలిసి దాదాపు వారం రోజుల పాటు చైనాలో పర్యటించారు. త్వరలో చిరంజీవి మరో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని, భార్య సురేఖతో కలిసి యూఎస్ఏ వెలుతున్నట్లు ప్రచారం మొదలైంది.
ఈ ట్రిప్పులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా వెలుతున్నారని టాక్. అయితే ఉన్నట్టుండి చిరంజీవి యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేయడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి ఏవో ఫైనాన్షియల్ డీలింగ్స్ కోసం వెలుతున్నారనే పుకార్లు సైతం వినిపిస్తున్నాయి.

మరికొందరేమో.... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా మొదలవ్వడానికి ముందు యూఎస్ఏలో కాస్త టైమ్ స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని, అక్కడ ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు స్పెషల్ డైట్, పిట్ నెస్ ఫ్రోగ్రాంలో జాయిన్ కాబోతున్నారని టాక్.


Click it and Unblock the Notifications