twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు జీవితంపై పుస్తకం అవసరమా?..: అక్కినేని

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆ రేంజిలో వెలిగిన నటుడు చిరంజీవి. ఎవరి అండా లేకుండా స్వయంశక్తితో ఇండస్ట్రీలో ఎదగడమే కాదు.... తెలుగు ప్రేక్షకుల్లో చెరగని స్థానం సంపాదించుకుని మెగాస్టార్ అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలకు దూరమై రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

    తాజాగా చిరంజీవి సినీ ప్రస్థానంపై ఓపుస్తకం వెలువడింది. ప్రముఖ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'చిరంజీవితం-సినీ ప్రస్థానం' అనే పుస్తకాన్ని పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించి తొలి కాపీని రామ్ చరణ్ కు అందించారు.

    ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిరంజీవి స్వయం కృషితో ఎదిగారని కొనియాడారు. నటన, డాన్స్ ల విషయంలో తనదైన శైలి ప్రదర్శించి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారని ప్రశంసించారు. చిరంజీవి గురించి, ఆయన ఎదుగుదల గురించి అందరికీ తెలిసు. ఆయన గురించి పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. అయితే ఇటువంటి పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో రామారావు లాంటి వారు రాస్తుంటారని చమత్కరించారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ "ఆటో బయోగ్రఫీ రాయాలని నాన్న గారిని అడిగాను కానీ ఆయన ఇంట్రస్టు చూపలేదు. చాలా మంది జీవిత చరిత్ర రాస్తామని వచ్చినా ఆయన ఇంట్రస్టు చూపలేదు. మా కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి రామారావుగారు ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ"ని చెప్పుకొచ్చారు. రామారావు సొంతంగా సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని వేయించారని, చాలా గ్రాండ్ గా రిలీజ్ చేద్దామని తాను చెప్పినా ఆయన ఒప్పుకోలేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

    English summary
    Chiranjeevitham - Cine Prasthanam book was launched at Prasad Labs on Sunday in Hyderabad. Veteran actor Akkineni Nageswara Rao launched the book and handed over the first book to Chiranjeevi's son Ram Charan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X