twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు చేతుల మీదుగా మంచు ఫ్యామిలీ ఆడియో

    By Srikanya
    |

    హైదరాబాద్ : టామ్ అండ్ జెర్రీలమని స్వయంగా చెప్పుకునే చిరంజీవి,మోహన్ బాబు ఒకే వేదికపై కలవనున్నారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తాజా చిత్రం 'దేనికైనా రెడీ' ఆడియో పంక్షన్ కి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ఆడియో పంక్షన్ జరగనుంది. విష్ణు, హన్సిక జంటగా రూపొందుతున్న చిత్రం 'దేనికైనా రెడీ'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

    మంచు విష్ణు మాట్లాడుతూ... " ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దాంతో పాటు తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. తొలిసారిగా నా సినిమా మలయాళంలో డబ్బింగ్ అవుతోంది. ఈ మలయాళ వెర్షన్ పాటలు అలరిస్తాయి. దాని డబ్బింగ్ పనులు పూర్తికావచ్చాయి. 'గాడ్స్ ఓన్ కంట్రీ'లో 'దేనికైనా రెడీ' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా ఆదరణ పొందుతుందనీ, అందరు మలయాళీల హృదయాల్ని స్పృశిస్తుందనీ ఆశిస్తున్నా. అక్టోబర్ తొలి వారంలో మలయాళ వెర్షన్ పాటల్ని కొచ్చిలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.

    ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

    ఈ సినిమా మలయాళంలో అనువాదమవుతోంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకేసారి అక్టోబర్‌లో విడుదల కాబోతోంది. సుమన్, సీత, ప్రభు, కోట శ్రీనివాసరావు, విక్రమ్ ప్రధాన తారాగణమైన ఈ చిత్రానికి కథా విస్తరణ: బీవీఎస్ రవి, నాగేశ్వరరెడ్డి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, సంగీతం: చక్రి, యువన్‌శంకర్ రాజా, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్, ఫైట్స్: సెల్వా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వంశీకృష్ణ, సమర్పణ: బేబీ అరియానా, బేబీ వివియానా.

    English summary
    
 Manchu Vishnu's Denikaina Ready will have its music launch on September 28th at Gandhrva Mahal set in Hyderabad. Megastar Chiranjeevi will be gracing the ceremony as the chief guest. Chiru unveil the music albums. The film has music by Chakri and stars Vishnu and Hansika as the lead pair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X