twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు సలహా: 'పరుగు' విడుదల

    By Staff
    |
    Allu Arjun
    ఈ సమ్మర్ లో క్రేజి ప్రాజెక్టుగా మారిన 'పరుగు' చిత్రాన్ని మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలిపారు. మొదట ఏప్రిల్ 25 నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకొన్నామని ఆయన అన్నారు. అయితే చిరంజీవి సూచన మేరకు 'జల్సా'కు 30 రోజులు గ్యాప్ ఇచ్చేందుకు మే ఒకటికి విడుదల వాయిదా వేసుకొనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే 'బొమ్మరిల్లు' భాస్కర్ తన బ్యానర్ పై రూపొందించిన ఈ రెండో చిత్రం కూడా హిట్ కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇక దర్శకుడు భాస్కర్ సినిమా ఫైనల్ ప్రింట్‌తో తాను సంతృప్తి చెందినట్టు చెప్పారు. కొత్త కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సక్సస్ పట్ల తనకు ఎలాంటి సందేహం లేదని బన్నీ ధీమా వ్యక్తంచేశాడు. కూతురున్న ప్రతీ తండ్రి కధగా పబ్లిసిటి చేస్తున్న ఈ 'పరుగు' మేడే నుండి థియేటర్లలో స్ధిరపడుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X