twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ పరామర్శ ఎందుకంటే..చిరు

    By Staff
    |

    Chiranjeevi
    తోటి నటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ను పరామర్శించానని, ఇద్దరం సినీ పరిశ్రమకు చెందినవారము కాబట్టే వెళ్ళటం జరిగిందని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. అంతేగాక ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేసారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ చిన్ననాటి నుంచి ఆత్మస్థైర్యం గల వ్యక్తని, అతను త్వరగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని అన్నారు.

    అలాగే యాక్సిడెంట్‌ జరిగిన రోజునే ఎన్టీఆర్‌ గురించి ఆయన తల్లి షాలినిని అడిగి తెలుసుకున్నానని, ఎన్టీఆర్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఉందని చెప్పారు. అనంతరం అల్లు అరవింద్‌, సినీనటులు బాలకృష్ణ, వేణుమాధవ్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌ యాదవ్‌ లు జూనియర్‌ ఎన్టీఆర్‌ను పరామర్శించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించామని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ అదుపులో ఉందని కిమ్స్‌ సీఈవో డాక్టర్‌ భాస్కరరావు తెలిపారు.

    బుధవారం నుంచి ఎన్టీఆర్‌ తనకు తానే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నామన్నారు. మరో నాలుగు రోజుల తర్వాత పూర్తి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగనిపిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ను కూర్చోబెట్టేందుకు, నడిపించేందుకు ప్రయత్నం చేయిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేస్తూ చిరంజీవి వివరణ ఇవ్వటం అందరినీ ఆలోచింపచేసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X