Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ పరామర్శ ఎందుకంటే..చిరు
అలాగే యాక్సిడెంట్ జరిగిన రోజునే ఎన్టీఆర్ గురించి ఆయన తల్లి షాలినిని అడిగి తెలుసుకున్నానని, ఎన్టీఆర్కు ఉజ్వల భవిష్యత్ ఉందని చెప్పారు. అనంతరం అల్లు అరవింద్, సినీనటులు బాలకృష్ణ, వేణుమాధవ్, దర్శకుడు వీవీ వినాయక్, సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ లు జూనియర్ ఎన్టీఆర్ను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్కు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించామని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులో ఉందని కిమ్స్ సీఈవో డాక్టర్ భాస్కరరావు తెలిపారు.
బుధవారం నుంచి ఎన్టీఆర్ తనకు తానే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నామన్నారు. మరో నాలుగు రోజుల తర్వాత పూర్తి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగనిపిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ను కూర్చోబెట్టేందుకు, నడిపించేందుకు ప్రయత్నం చేయిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేస్తూ చిరంజీవి వివరణ ఇవ్వటం అందరినీ ఆలోచింపచేసింది.