Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కూతురు జ్ఞాపకార్థం ట్రస్టు నెలకొల్సిన చిత్ర
ప్రముఖ గాయని చిత్ర తన కూతురు నందన జ్ఞాపకార్థం 'స్నేహ నందన' చారిటబుల్ ట్రస్తును స్థాపించారు. ఈ ట్రస్టు ద్వారా పేదరికంలో మగ్గుతున్న వృద్ధ గాయనీగాయకులకు ఆర్ధిక సాయం అందించనున్నారు.
ఈ ట్రస్టు స్థాపించడానికి గల కారణాలపై గాయని చిత్ర మాట్లాడుతూ.. తిండికి కూడా నోచుకోని వృద్ధ కళాకారులు ఈ రోజు ఎంతో మంది వున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఈ ట్రస్టు నెలకొల్పాం. అటువంటి కళాకారులను గుర్తించి వారికి ఆర్ధిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇద్దరు వృద్ధ కళాకారులను గుర్తించడం జరిగిందనీ, వారికి నెలకు రూ. 3000 రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ త్వరలో ప్రారంభిస్తామన్నారు.
చిత్ర తన తీయని కమఠ స్వరంతో కోట్లాది అది శ్రోతల వీనుల్లో అమృతం నింపితే, ఆమె జీవితంలో మాత్రం దయలేని ఆ భగవంతుడు హలాహలాన్నే నింపాడు. గాయని చిత్ర, విజయ్ శంకర్ దంపతులకు వివాహం జరిగిన పదిహేనేళ్ళకు ఎన్నో నోముల, వ్రతాల, పూజల ఫలితంగా లేక లేక కలిగిన ఏకైక సంతానం బేబీ నందన. షార్జా స్టేడియంలో రెహమాన్ సంగీత విభావరిలో పాల్గొనేందుకు సకుటుంబంగా గాయని చిత్ర దుబాయ్ కి వెళ్ళారు. అక్కడ ఒక రిసార్ట్ లో విల్లాలో చిత్ర కుటుంబానికి బస ఏర్పాటు చేశారు. ఆ విల్లాలోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తూ పడి బేబీ నందన మరణించింది. గత సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈ ఘటనచోటు చేసుకుంది.