Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎవరికి మూడిందో: శ్రుతిహాసన్ కేసు...సీఐడీ స్పీడు
హైదరాబాద్: శ్రుతి హాసన్ చిత్రాలపై ఉత్పన్నమైన వివాదంలో సీఐడీ పోలీసులు న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నారు. రామ్ చరణ్తేజ్, అల్లుఅర్జున్లతో కలిసి తాను నటించిన 'ఎవడు' చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాలంలో పెట్టారంటూ శ్రుతిహాసన్ కొద్దిరోజుల క్రితం సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
సైబర్ విభాగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ఒకరిద్దరు ఛాయాగ్రహకులను పిలిపించి విచారించారు. సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫొటోలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. న్యాయ విభాగం సూచనలు, ఫోరెన్సిక్ ప్రయోగశాల ఫలితాలొచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తులు దొరికి కేసు నిరూపితమైతే జైలు శిక్ష పడే అవకాశముంది.
అయితే ఇప్పుడు ఈ కేసులో ఎవరు ఇరుక్కోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నిర్మాత నిర్లక్ష్యం కూడా ఇందులో విచారణకు వస్తుందా అనే విషయం సైతం చర్చకు వస్తోంది. కావాలని ఎవరైనా ఈ ఫొటోలను లీక్ చేసారా లేక మరో విధంగా జరిగిందా అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. దిల్ రాజు సినిమాలకు రెగ్యులర్ గా పనిచేసే ఫొటో గ్రాఫర్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ఇక ఈ కేసుతో మిగతా ఆఫీసుల్లో కూడా జాగ్రత్త పడతారని తెలుస్తోంది.