Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఎవరికి మూడిందో: శ్రుతిహాసన్ కేసు...సీఐడీ స్పీడు
హైదరాబాద్: శ్రుతి హాసన్ చిత్రాలపై ఉత్పన్నమైన వివాదంలో సీఐడీ పోలీసులు న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నారు. రామ్ చరణ్తేజ్, అల్లుఅర్జున్లతో కలిసి తాను నటించిన 'ఎవడు' చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాలంలో పెట్టారంటూ శ్రుతిహాసన్ కొద్దిరోజుల క్రితం సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
సైబర్ విభాగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ఒకరిద్దరు ఛాయాగ్రహకులను పిలిపించి విచారించారు. సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫొటోలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. న్యాయ విభాగం సూచనలు, ఫోరెన్సిక్ ప్రయోగశాల ఫలితాలొచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తులు దొరికి కేసు నిరూపితమైతే జైలు శిక్ష పడే అవకాశముంది.
అయితే ఇప్పుడు ఈ కేసులో ఎవరు ఇరుక్కోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నిర్మాత నిర్లక్ష్యం కూడా ఇందులో విచారణకు వస్తుందా అనే విషయం సైతం చర్చకు వస్తోంది. కావాలని ఎవరైనా ఈ ఫొటోలను లీక్ చేసారా లేక మరో విధంగా జరిగిందా అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. దిల్ రాజు సినిమాలకు రెగ్యులర్ గా పనిచేసే ఫొటో గ్రాఫర్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ఇక ఈ కేసుతో మిగతా ఆఫీసుల్లో కూడా జాగ్రత్త పడతారని తెలుస్తోంది.