తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ నందగోపాల్!
ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, క్రిటిక్ నందగోపాల్(84) నేడు మరణించారు. ఆయన ప్రముఖ సినీ విమర్శకుడిగా అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన సినీ విమర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1951 లో పేరంటాలు సినిమాపై నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి సాధించారు. అప్పటికి ఆయన వయసు 18 ఏళ్ళు.
1995 లో ఏపీ ప్రభుత్వం ఆయన ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు అందించింది. 2000 సంవత్సరంలో దాసరి నారాయణరావు స్వర్ణపతకం అవార్డు అందుకున్నారు. 2013 లో ఆయన రాసిన రాసిన 'సినిమాగా సినిమా' గ్రంధానికి ఉత్తమ సినిమా గ్రంథంగా అవార్డు లభించింది.

ఆయన మృతి చెందిన విషయం తెలిసి జర్నలిస్టులు, సినిమా ప్రముఖులు సంతాపం తెలియజేస్తునారు. ఆయన సినిమాపై చేసే విమర్సలు ఎవరిని నొప్పించకుండా ఉండేవని అంటారు.


Click it and Unblock the Notifications











