Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సినిమా గా సినిమా’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ : సినియర్ జర్నలిస్టు నాదెళ్ల నందగోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ఎఫ్సిసిలో జరిగింది. ప్రముఖ సినీ రచయిత సి నారాయణరెడ్డి చేతుల మీదుగా తొలి ప్రతిని విడుదల చేసారు. ఈకార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి రామానాయుడు, ఎంఎల్సి నన్నపనేని రాజకుమారి, కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసాద్స్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినారె మాట్లాడుతూ పుస్తకం పేరు చిత్ర విచిత్రంగా గొప్పగా ఉంది. సినిమా రంగంలో చాలా కృషి చేసిన నాదెళ్ల నందగోపాల్ ఈ పుస్తకం ద్వారా సినిమా రంగానికి చెందిన అన్ని పార్శాలను టచ్ చేసారు. అచ్చు చేసిన హనుమంతరావు అభినందనీయులు అన్నారు.
డి.రామానాయుడు మాట్లాడుతూ నందగోపాల్ తనకు చాలా సంవత్సరాల నుండి పరిచయమని, ఆ రాసిన ఈ పుస్తంగా గొప్పగా ఉందని తెలిపారు. సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ నందగోపాల్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు సినిమా రంగంలో ఆత్మీయులు. ఆయన రచించిన ఈ పుస్తకాన్ని పరుచూరి హనుమంతరావుకు అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.
సినిమా రంగంలోని పరిణామ క్రమాన్ని ఈ పుస్తకంలో వివరించారు. హనుమంతరావు ప్రోత్సాహం వల్లనే ఈ పుస్తకం రాసానని, ఈ పుస్తకం కోసం ఐదేళ్లు కష్టపడ్డట్లు రచయిత నాదేళ్ల నందగోపాల్ వెల్లడించారు. పరుచూరి హనుమంతరావు మాట్లాడుతూ...ఈ పుస్తకంలో నందగోపాల్కు తెలిసిన సినిమా వివరాలన్నీ పొందు పరిచారు. తెలుగు యూనివర్శిటీ వారు దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చుతామని చెప్పారు అని తెలిపారు.