Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దేవుళ్లు కాంబినేషన్లో వెండితెరపై సత్య సాయిబాబా మహిమలు చిత్రం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవంగా మారిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్రపై ఓ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతోంది. సత్యసాయిబాబా పుట్టుక నుండి ఆయన తన పద్నాలుగేళ్లలో ఆధ్యాత్మిక వైపు మరలడం, ఆ తర్వాత తాను షిరిడీ సాయిబాబా అవతారంగా చెప్పడం, ఆ సమయంలో ఆయన మాటలు చేసి భక్తులకు కానుకలు సమర్పించడం ఆ తర్వాత ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు తదితర అంశాలను జోడిస్తూ త్వరలో చిత్రాన్ని నిర్మించే యోచనలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య నిర్మించనున్నారు. జోగయ్య గతంలో దేవుళ్లు చిత్రాన్ని కూడా నిర్మించారు.
ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.