‘సినిమా పోస్టర్’ పుస్తకావిష్కరణ
సీనియర్ చిత్రకారుడు ఈశ్వర్ రూపొందించిన 'సినిమా పోస్టర్" పుస్తకాన్ని పలువురు సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. దాసరినారాయణరావు 'సినిమాపోస్టర్" పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డి. రామానాయుడుకు అందజేశారు. ఈ పుస్తకం గురించి రూపకర్త ఈశ్వర్ మాట్లాడుతూ 'పోస్టర్ తయారు చేసే విధానంలో కాలంతో పాటు కొత్త విధానాలు చోటు చేసుకున్నాయి. ముందు తరాలకు పోస్టర్ గురించి తెలియజేయాలనే ఆలోచనతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీని కోసం మూడు సంవత్సరాలు కృషి చేశాను. ఈ ప్రయత్నంలో నాకు ఎంతో మంది సహకారం అందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన విజయా పబ్లికేషన్స్ అధినేత విశ్వనాధ్డ్డి గారికి, ఈ కార్యక్షికమంలో పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞతలు"అన్నారు.
ఈశ్వర్ గురించి దాసరి నారాయణ రావు మాట్లాడుతూ తన కుంచెతో జనానికి కనిపించిన కళాకారుడు ఈశ్వర్. ఆయన ఆనుభవాన్ని రంగరించి ఈ పుస్తకాన్ని భావితరాల కోసం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్షికమంలో సి.అశ్వనీదత్, మురారి, గొల్లపూడి మారుతీరావు, కె. రాఘవేంవూదరావు, ఆదిశేషగిరిరావు, ప్రసన్నకుమార్, మురళీమోహన్, తనికెళ్ళభరణి, అర్జునరాజు కె.సి.శేఖర్బాబు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











