Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ ఇక లేరు
చెన్నై : ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అభినందన,నీరాజనం వంటి అభిరుచి గల చిత్రాల దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మృతి చెందారు. ఆయన గత ఆరు నెలలుగా గుండెకు సంభందించిన ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్నారు. చెన్నై,హైదరాబాద్ లలోని హాస్పటిల్స్ లో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్యం మరీ విషమించటంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకు వచ్చారు. పలు భారతీయ భాషల్లో ఆయన దాదాపు వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసారు. జీన్స్ వంటి చిత్రాలకు సైతం ఆయన చేతిలో రూపుదిద్దుకున్నవే.
పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.
అశోక్ కుమార్ తెలుగు తమిళ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.