Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ ఇక లేరు
చెన్నై : ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అభినందన,నీరాజనం వంటి అభిరుచి గల చిత్రాల దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మృతి చెందారు. ఆయన గత ఆరు నెలలుగా గుండెకు సంభందించిన ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్నారు. చెన్నై,హైదరాబాద్ లలోని హాస్పటిల్స్ లో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్యం మరీ విషమించటంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకు వచ్చారు. పలు భారతీయ భాషల్లో ఆయన దాదాపు వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసారు. జీన్స్ వంటి చిత్రాలకు సైతం ఆయన చేతిలో రూపుదిద్దుకున్నవే.
పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.
అశోక్ కుమార్ తెలుగు తమిళ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.